Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కరోనా టీకాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం

ప్రధాని మోదీ విమర్శ
డెహ్రాడూన్‌: కోవిడ్‌ టీకాల గురించి కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేదేమీ లేకపోవడంతో కోవిడ్‌ టీకాలను రాజకీయాలకు వాడుకుంటుందని మండిపడ్డారు. ఇటీవల మరణించిన దేశ ప్రథమ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కాంగ్రెస్‌ నిందిస్తోందని ఆరోపించారు. జనరల్‌ రావత్‌ను అవమానిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఉత్తరాఖండ్‌ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. మోదీ శనివారం రుద్రపూర్‌ ర్యాలీలో ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు చేసిందని మోదీ చెప్పారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించిందని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఉచితంగా బియ్యం అందజేశామని, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయలేదన్నారు. కోవిడ్‌ కాలంలో ఏ ఒక్క పేదవాడిని ఆకలి కడుపులతో పండుకోనివ్వలేదన్నారు. ఉత్తరాఖండ్‌ అభివృద్ధి విషయంలో బీజేపీని ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేరని, రాష్ట్రంలో రోడ్లు, రైల్వే, విమానాల అనుసంధానం పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం కోవిడ్‌ వాక్సినేషన్లపై ఊహాగానాలు ప్రచారం చేయడం తప్ప మాట్లాడటానికి ఇంకేమీ లేవని మోదీ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img