న్యాయమూర్తుల పదోన్నతికి సుప్రీం కొలీజియం ఆమోదం
న్యూదిల్లీ : కర్ణాటక హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులను నియమించేందుకు సిఫార్సు చేసిన ఆరుగురు అదనపు జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం 17వ తేదీన భేటీ అయింది. న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన గురువారం సర్వోన్నత న్యాయ స్థానం వెబ్సైట్లో అప్లోడ్ అయింది. శాశ్వత జడ్జీలుగా పదోన్నతి పొందుతున్న వారిలో జస్టిస్ నీరనహల్లి శ్రీనివాసస్ సంజయ్ గౌడ, జస్టిస్ జ్యోతి ములిమణి, జస్టిస్ నటరాజ్ రంగస్వామి, జస్టిస్ హేమంత్ చంద్రన్గౌదర్, జస్టిస్ ప్రదీప్ సింగ్ యేరూర్, జస్టిస్ మహేశన్ నాగప్రసన్న ఉన్నారు. కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తి కౌశిక్చంద్రను శాశ్వత న్యాయమూర్తిగా నియమించేందుకూ కొలీజియం అంగీకరిం చింది. కొలీజియం సభ్యులుగా జస్టిస్ రమణ, జస్టిస్ యూయూ లిలిత్, జస్టిస్ ఎంవీ ఖాన్విల్కర్ ఉన్నారు.