ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు ముగిసాయి. సోమవారం మధ్యాహ్నం బులంద్షహర్లోని నరోరా టౌన్ బన్సీఘాట్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ సహా పలువురు బీజేపీ నేతలు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.