Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో పొత్తుకి మమతాబెనర్జీ సిద్ధం : శరద్‌ పవార్‌

కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవడానికి మమతాబెనర్జీ రెడీగా ఉన్నారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ప్రెసిడెంట్‌ శరద్‌ పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి మమతా బెనర్జీ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యతిరేకించిన విషయాన్ని విలేకరులు ఆయన ముందు ప్రస్తావించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఎంసీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా అని అడిగారు. ఇందుకు సమాధానంగా గత అనుభవాలను పక్కన బెడతారని శరద్‌ పవార్‌ వివరించారు. జాతీయ ప్రయోజనాల కోసం గత అనుభవాలను పక్కన పెట్టడానికి మమతా బెనర్జీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసిందని, దీని కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి లబ్ది చేకూరిందని ఆయన వివరించారు. జాతీయ ప్రయోజనాల కోసం ఆమె గతాన్ని వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్ష కూటమి కోసం ఒక చోట చేరడానికి రెడీగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img