త్వరలోనే సోనియా తుది నిర్ణయం
దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో ఆమె చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారిలో కొందరు ప్రశాంత్ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. వీరిలో పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతేడాది సోనియాకు లేఖ రాసిన 23 మంది నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే మరికొందరు నాయకులు మాత్రం కిశోర్ వల్ల పార్టీకి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నట్లు సమాచారం.