Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కాస్త తగ్గిన కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైనే నమోదవుతోన్న కొత్త కేసులు కాస్త తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,25,760 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,44,264 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉందయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 51 మంది కరోనాకు బలవగా, 16,069 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.
గతకొన్ని రోజులుగా భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ 6.48 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్ల 4 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img