మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఓ ప్రైవేట్ ఏవియేషన్ స్కూల్కు చెందిన చిన్న విమానం సోమవారం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మహిళా పైలట్ గాయపడ్డారు. ఈ మేరకు వివరాలను పోలీసులు వెల్లడిరచారు.ఇందాపూర్ తహసీల్లోని కడ్బన్వాడి వద్ద సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. పుణెలోని బారామతి విమానాశ్రయం నుంచి ప్రైవేట్ ఏవియేషన్ స్కూల్కు చెందిన విమానం బయలుదేరిందని తెలిపారు.
ఈ ప్రమాదంలో పైలట్ భావా రాథోడ్కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆ విమానం బాగా దెబ్బతిన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. విమానం కూలిపోవడంతో స్థానిక జనాలు మొదట భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి విమానంలోని మహిళా పైలట్ను బయటకు తీసుకొచ్చారు. చిన్నగాయాలతోనే మహిళా పైలట్ బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.