శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుల్గాంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందినట్టు శనివారం పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో దక్షిణ కశ్మీరు జిల్లాలో భద్రతా దళాలు కార్డాన్ సెర్చ్ ప్రారంభించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో మొదటగా ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారన్నారు. ఈ కారణంగా ఓ ఉగ్రవాది మృతి చెందాడని వివరించారు. చనిపోయిన ఉగ్రవాది ఎవరు, ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో నిర్ధారించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు అందాల్సి ఉందని తెలిపారు.