Friday, April 19, 2024
Friday, April 19, 2024

కెప్టెన్‌ పునరాలోచించాలి

: హరీష్‌ రావత్‌
పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు పార్టీలో అవమానం జరిగిందనడం అబద్ధమని ఏఐసీసీ పంజాబ్‌ ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ అన్నారు. తనను కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందంటూ ఇటీవల అమరీందర్‌సింగ్‌ చేసిన స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే అతను ఒకరకమైన ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమవుతున్నదన్నారు. భారతీయ జనతా పార్టీకి సాయపడొద్దని చెప్పారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలనే నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. తాను కాంగ్రెస్‌లో ఉండబోనని, బీజేపీలో చేరబోనని కెప్టెన్‌ సింగ్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రావత్‌ ఈ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img