కేంద్రమంత్రి నారాయణ్కు మంగళవారం అర్థరాత్రి తర్వాత రాయగఢ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని కోర్టులో నారాయణ్ రాణె తరఫు న్యాయవాదులు వాదించారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాణేకు బెయిల్ రావడంతో ముంబై చేరుకున్న ఆయ మద్ధతుదారులు ఘనస్వాగతం పలికారు.