ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు అని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇస్తామంటూ పలు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ హామీలు గుప్పిస్తున్నారని… దిల్లీలో ఆయన ఏం చేశారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీలో స్కూళ్లను అద్భుతంగా తీర్చి దిద్దామని చెప్పుకుంటున్నారని… అలాంటప్పుడు ఆప్ ఎమ్మెల్యేల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చదవడం లేదని ప్రశ్నించారు. ముందు దిల్లీ పాఠశాలల్లో స్టాండర్డ్స్ను మెరుగు పరుచుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యానికి సంబంధించిన ఉచిత హామీలను కేజ్రీవాల్ మరో స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఉచిత హామీలపై డిబేట్ జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.