కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం కేరళ బయలుదేరి వెళ్లారు. కోజికోడ్, మలప్పురంలో ఒకరోజు పర్యటన కోసం వెళ్లిన రాహుల్ అక్కడ పలు ప్రాజెక్టులు ప్రారంభించి, గురువారం ఉదయం దిల్లీకి తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ కాంగ్రెస్లో తాజా నాయకత్వ సంక్షోభం నెలకొన్నప్పటికీ ముందస్తు షెడ్యూల్ ప్రకారమే రాహుల్ కేరళ వెళ్లినట్టు తెలిపాయి. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి నవజ్యోత్ సింగ్ రాజీనామా చేయడంతో తాజాగా ఆక్కడ నాయకత్వ సంక్షోభం తలెత్తింది. సిద్ధూను శాంతిపజేయాలని పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పర్గత్ సింగ్ను పార్టీ అధిష్ఠానం కోరినట్టు తెలుస్తోంది. కాగా, ఆందోళన చెందాల్సిన పనే లేదు, అన్నీ సద్దుకుంటాయని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై తాజాగా వ్యాఖ్యానించారు.