Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కేరళలో నిపా.. ఆ 8 మందికి నెగటివ్‌

నిపా వైరస్‌ సోకి కేరళలో ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ బాలుడితో దగ్గరి సంబంధాలు ఉన్న 8 మంది శ్యాంపిళ్లు నెగటివ్‌గా తేలింది. బాలుడితో కాంటాక్ట్‌లోకి వచ్చినవారి శ్యాంపిళ్లను పుణెలోని వైరాలజీ ఇన్స్‌టిట్యూట్‌కి పంపగా.. అందులో 8 మంది శ్యాంపిళ్లు నెగటివ్‌గా తేలిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఇవాళ తెలిపారు. మరిన్ని శ్యాంపిళ్లను కూడా టెస్టింగ్‌ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. బాలుడితో దగ్గరి సంబంధాలు ఉన్న ఆ 8 మందికి నెగటివ్‌ రావడం కొంత ఊరటనిచ్చే అంశమని మంత్రి చెప్పారు. ఇందులో ఆ బాలుడి పేరెంట్స్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లు ఉన్నారు. మరో ముగ్గురి శ్యాంపిళ్లను పరీక్షకు పంపినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img