మళ్లీ పూర్తిస్థాయి లాక్డౌన్
కేరళలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17,18 తేదీల్లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. గత జూన్ 12, 13 తేదీల్లో ఏ గైడ్ లైన్స్ ని జారీ చేశామో..వాటినే ఇప్పుడు కూడా పాటించాలని పేర్కొంది.తాజా గైడ్ లైన్స్ జులై 15 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. కేరళలో నిన్న 14,539 కేసులు నమోదు కాగా-124 మంది రోగులు మరణించారు. టెస్ట్ పాజిటివిటీ రేటు 10.46 శాతం ఉంది. గత 24 గంటల్లో లక్షా 39 వేలకు పైగా శాంపిల్స్ సేకరించారు. ప్రజలు కోవిడ్ ప్రొటొకాల్స్ మాత్రం తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు.