తిరువనంతపురం: కేరళలో గురువారం కొత్తగా 59 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయయి. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 480కి చేరింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కొత్త కేసుల్లో అలప్పుజా జిల్లా నుంచి అత్యధికంగా 12 కేసులు నమోదవగా త్రిస్సూర్
10, పతనంతిట్ట8, ఎర్నాకుళం
7, కొల్లాం, మలప్పురం జిల్లాల్లో 6 చొప్పున, కోజికోడ్`5, పాలక్కడ్, కసారాగోడ్ నుంచి 2 చొప్పున, కన్నూరు జిల్లాలో ఒక కేసు వెలుగు చూసింది. ఇందులో 42మంది తక్కువ ప్రమాదం దేశాలనుంచి వచ్చినవారు కాగా, ఐదుగురు అధిక ప్రమాదకర దేశాల నుంచి వచ్చినవారు, మరో తొమ్మిదిమంది కాంటాక్ట్ల వల్ల వైరస్ సోకినవారు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వివరించింది.