Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కేరళలో 76 ఒమిక్రాన్‌ కేసులు

తిరువనంతపురం: కేరళలో బుధవారం కొత్తగా 76 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కొత్త రకం ఒమిక్రాన్‌ సోకిన వారి సంఖ్య 421కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. పతనంతిట్టలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలలో ఒమిక్రాన్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేశామని, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తితో పరిచయం ఉన్న విద్యార్థి నుంచి ఈ వ్యాధి వ్యాపించిందని అనుమానిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త కేసుల్లో త్రిసూర్‌ జిల్లా నుంచి 15, పతనంతిట్ట నుంచి 13, అలప్పుజ నుంచి 8, కన్నూర్‌ నుంచి 8, తిరువనంతపురం నుండి 6, కొట్టాయం నుండి 6, మలప్పురం నుండి 6, కొల్లాం నుండి 5, కోజికోడ్‌, కాసరగోడ్‌ నుంచి 4 చొప్పున,వాయనాడ్‌, ఎర్నాకులంలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. వీటితో పాటు తమిళనాడు నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు మంత్రి వివరించారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తులలో 59 మంది తక్కువ-ప్రమాదకర దేశాల నుంచి ఏడుగురు అధిక ప్రమాదకర దేశాల నుంచి వచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img