దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. కొత్తగా 16,906పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,69,850కి చేరాయి. ఇందులో 4,30,11,874 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది మరణించారు. మరో 1,32,457 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 45 మంది మృతిచెందగా, 15,447 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.కరోనా కేసులు కొద్దిగా తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.68కి పడిపోయిందని పేర్కొన్నది. మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతంగా ఉందని, మరణాలు 1.20 శాతంగా ఉందని వెల్లడిరచింది. ఇప్పటివరకు 199.12 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.