Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కొత్త‌గా 656 క‌రోనా కేసులు.. 12మంది మృతి

కొత్త‌గా 656క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 12మంది మృతి చెందారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 1,16,603 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 656 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,82,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 13,037 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొవిడ్‌ నుంచి ఇప్పటి వరకు 4,44,37,304 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,790కి చేరింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.03 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img