ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కొనసాగుతోంది. సుమీలో చిక్కుకుపోయిన 242 మంది విద్యార్థులను పోలాండ్ మీదుగా భారత్ తీసుకువచ్చారు. ఆపరేషన్ గంగలో భాగంగా పోలాండ్లోని రెస్జౌ నుంచి ప్రత్యేక విమానం దిల్లీికి చేరింది. పోలండ్లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో బయల్దేరిన విమానం శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఢల్లీికి చేరింది. మరో రెండు విమానాలు నేడు పోలాండ్ నుంచి రానున్నాయి. వీటిలో మరో నాలుగు వందల మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.