Friday, April 19, 2024
Friday, April 19, 2024

కొవిడ్‌ పరిస్థితుల అనంతరం పెద్ద ఎత్తున విమాన ప్రయాణాలు

కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా
గత ఆదివారం పెద్ద ఎత్తున విమాన ప్రయాణాలు జరిగాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల అనంతరం విమాన ప్రయాణాలు గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే తొలిసారి అని చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది గతేడాది మార్చి 25 నుంచి మే 25 వరకు విమానాలు నడవలేదు. ఆ తర్వాత సర్వీసులు ప్రారంభమైనాగానీ ప్రయణీకులు విమానాల్లో ప్రయణానికి ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో గత ఆదివారం పెద్దఎత్తున ప్రయాణించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ 2,372 విమానాల్లో.. 3,27,923 మంది ప్రయాణించారని చెప్పారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొత్తం 2,372 విమానాల్లో 3,27,923 మంది ప్రయాణించారని తెలిపారు. కొవిడ్‌ పరిస్థితులకు ముందు భారత్‌లో రోజువారీ దేశీయ ప్రయాణికుల సంఖ్య 4.25 లక్షలుగా ఉండేది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img