గాల్లో ఉండగా మంటలు చెలరేగడంతో శిక్షణ విమానం కూలింది. దాంతో ప్లైట్ లో భారత సంతతికి చెందిన తల్లీ కూతుళ్లు ఉన్నారు. కాగా తల్లి దుర్మరణం చెందింది. కాగా ఆమె కూతురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే 23 ఏళ్ల పైలట్ పరిస్థితి కూడా క్రిటికల్ గా వుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పైలట్ ట్రైనింగ్పై ఆసక్తిగల వారి కోసం ఉద్దేశించిన డెమాన్స్ట్రేషన్ ఫ్లైట్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాద సమయంలో విమానంలో రోమా గుప్తా(63), ఆమె కూతురు రీవా గుప్తా(33) ఉన్నారు. ప్రమాదానికి ముందు కాక్పిట్లో పొగ వస్తున్న విషయాన్ని పైలట్ గ్రౌండ్ కంట్రోల్కు తెలియజేశాడు.