Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గోప్యత హక్కుపై ప్రభుత్వం దాడి : ప్రియాంక గాంధీ


పెగాసస్‌ స్పైవేర్‌పై వెల్లడైన విషయాలు నీతిబాహ్యమైనవని, ఇవి రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన గోప్యత హక్కుపై ప్రభుత్వం దాడి చేయడమేనని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ఇది భంగరమని పేర్కొన్నారు. పెగాసస్‌ ఉదంతంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా స్పందించారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులపై నిఘా కోసం వారి ఫోన్లను పెగాసస్‌ స్పైవేర్‌తో హ్యాక్‌ చేశారనే అంశంపై చర్చించాలని వర్షాకాల సమావేశాల్లో తొలిరోజు పలువురు విపక్ష నేతలు పట్టుబట్టారు. భారత్‌లో ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నేతలు, విపక్ష నేతలు, కొందరు కేంద్ర మంత్రులు సహా దాదాపు 300 మంది ఫోన్లను హ్యాక్‌ చేశారని ఆదివారం వెల్లడైన ఓ నివేదిక కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img