గోవా శాసన సభ ఎన్నికల ఫలితాలు కాస్త నిరాశపరిచినట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ చెప్పారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గట్టిగా పోరాడానని అన్నారు. ఈ పోరాటం తనకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. అయితే కాస్త నిరాశగా కూడా ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో పనాజీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఆయన దాదాపు 700 ఓట్లతో వెనుకంజలో ఉన్నట్లు కడపటి వార్తలను బట్టి తెలుస్తోంది. 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 19 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 11 స్థానాల్లోనూ ముందంజలో ఉన్నట్లు తాజా సమాచారం.