Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గ్రూప్‌ 1 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

గ్రూప్‌ 1 పోస్టులకు దరఖాస్తు గడువు పొడగించారు అధికారులు. నిన్నటితో దరఖాస్తు గడువు ముగియగా దీనిని జూన్‌ 4వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్ధుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫీజుల చెల్లింపు విషయంలో సమస్యలు తలెత్తినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎవరూ నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టులకు ఇప్పటివరకు 3,48,095 దరఖాస్తులు రాగా, మంగళవారం ఒక్కరోజే దాదాపు 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకొన్నట్టు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాటి రికార్డును ఇది అధిగమించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img