చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య ఫలితాలు సాధించింది. మొత్తం 35 మున్సిపల్ కార్పొరేషన్ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 14 కైవసం చేసుకుంది. బీజేపీ ఈసారి 12 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్ ఒక సీటుకు పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన అనూహ్య ఫలితాలపై ఆప్ సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది ‘ట్రయిలర్’ అని ఆ పార్టీ అభివర్ణించింది. ఆప్ కన్వీనర్, ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విజయాన్ని ‘మార్పునకు సంకేతం’గా ట్విట్టర్లో పేర్కొన్నారు.