Friday, April 19, 2024
Friday, April 19, 2024

చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం

చండీగఢ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ అనూహ్య ఫలితాలు సాధించింది. మొత్తం 35 మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీట్లలో ఆమ్‌ ఆద్మీ పార్టీ 14 కైవసం చేసుకుంది. బీజేపీ ఈసారి 12 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ 8 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్‌ ఒక సీటుకు పరిమితమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ సాధించిన అనూహ్య ఫలితాలపై ఆప్‌ సంబరాలు చేసుకుంటోంది. ఈ విజయాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది ‘ట్రయిలర్‌’ అని ఆ పార్టీ అభివర్ణించింది. ఆప్‌ కన్వీనర్‌, ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ విజయాన్ని ‘మార్పునకు సంకేతం’గా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img