అమృత్సర్లో సొంత కార్యకర్తల వ్యతిరేక ప్రచారం
అమృత్సర్ : పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరదించుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ పేరును ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో సొంత పార్టీలో అసమ్మతి పుట్టుకొచ్చింది. అధిష్ఠానం నిర్ణయాన్ని పార్టీ వర్గాలు అంతర్గతంగా వ్యతిరేకించాయి. ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. అకాలీ నేత బిక్రమ్ సింగ్ మజితియాపై సిద్ధూ పోటీ చేస్తున్న క్రమంలో అమృత్సర్ ఈస్ట్లో ప్రచార సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చన్నీకి వ్యతిరేకరంగా నినాదాలు చేశారు. సీఎం అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్ శాఖ మాజీ అధ్యక్షుడు సునీల్ జాకర్ పార్టీకి గట్టి షాకిచ్చారు. క్రియాశీల ఎన్నికల విధానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తమ పార్టీలో సీఎంగా అర్హులైన నాయకుల కొరత లేదన్నారు. సీఎం పదవికి సిక్కు నాయకుడే సరైనోడని దిల్లీలో కూర్చొని పార్టీ అధ్యక్షులు చెప్పడం బాధాకరమన్నారు. పంజాబ్ లౌకిక రాష్ట్రమన్న ఆయన పంజాబ్కు ఓ హిందువు ముఖ్యమంత్రి కాలేరన్న అంబికా సోని వ్యాఖ్యలు కలచివేశాయన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చన్నీ సీఎం అభ్యర్థిత్వాన్ని సిద్ధూ మద్దతుదారులతో పాటు కాంగ్రెస్లోని సీనియర్లు కొందరు వ్యతిరేకించారు. ఈ క్రమంలో సిద్ధూ పోటీ చేస్తున్న అమృత్సర్ ఈస్ట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. చన్నీ అభ్యర్థిత్వాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 20న పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చన్నీని ఓడిరచాలని సొంత పార్టీ కార్యకర్తలే ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కొందరు నాయకుల నుంచి ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకుందని అధిష్ఠానం తీరును తప్పుపట్టారు. చన్నీ ఎంపిక, సిద్ధూ తిరస్కృతిపై సొంత పార్టీలో అసమ్మతి వార్తలను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జోగిందర్ పాల్ ధింగ్రా తోసిపుచ్చారు. అంతా సవ్యంగా ఉందని, పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమిస్తున్నాడన్నారు. రాహుల్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సిద్ధూ పేర్కొనడాన్ని గుర్తుచేశారు. చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో తమకు ఒరిగేది ఏమీ లేదని అమృత్సర్ ఈస్ట్లో ప్రచారం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సింగ్ వెల్లడిరచారు. రాష్ట్రంలో తమ పట్టును పెంచుకుంటున్నట్లు తెలిపారు. చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా నాలుగు నెలలు ఉన్నారు. అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత ఆయన ఈ బాధ్యతలను చేపట్టిన విషయం విదితమే.