జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సీజేఐ జస్టిస్ రమణ స్పందన
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఆయన్ని ఆటో ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్లు స్పష్టమవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గురువారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వద్ద ఈ కేసు గురించి ప్రస్తావించింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ, ఈ కేసు గురించి తమకు తెలిసిందని, తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.