పుల్వామా: జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా పాంపొరిలో ఇవాళ ఉదయం కేంద్ర భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటరులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ ఉమర్ ముస్తాఖ్ ఖాండే హతమయ్యాడు. భగత్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఇద్దరు పోలీసులను ఉమర్ ముస్తాఖ్ ఖాండే హతమార్చాడు. ఇతను శనివారం ఎన్కౌంటర్ అయ్యాడని పోలీసులు తెలిపారు. పాంపొరి సమీపంలోని డ్రాంగ్ బల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరుగుతున్నాయని ఐజీ ట్వీట్ చేశారు. లష్కరే తోయిబా టాప్ టెన్ కమాండర్లను తాము గాలిస్తున్నామని ఐజీ ట్వీట్ చేశారు.