Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారం మేరకు జమ్మూకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఇవాళ ఉదయం ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించింది. గాలింపు సాగుతుండగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి.ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశంలో భద్రతా బలగాలు దాడి చేయడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్‌ పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం తమ బృందాలు ఇంకా గాలిస్తున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img