Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు హతం

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అల్‌-బదర్‌ ఉగ్రవాదులు హతమయ్యారు.కుల్గాం జిల్లా హుసన్‌పోరా గ్రామంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది..హుస్సేన్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన నిర్దిష్ట సమాచారం తర్వాత పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ సంయుక్త బృందం గాలింపు ప్రారంభించిందని, శోధన బృందం అనుమానాస్పద ప్రదేశాన్ని చుట్టుముట్టడంతో కాల్పులు ప్రారంభమయ్యాయని పోలీసు అధికారి తెలిపారు. ఇంతకుముందు జరిగిన 6 ఎన్‌కౌంటర్లలో ఆరుగురు పాకిస్థానీలు మరణించారు. ఉగ్రవాదుల నుంచి అమెరికన్‌ మేడ్‌ రైఫిల్స్‌, రెండు ఏకే 56, 2ఏకే 47 రైఫిల్స్‌తో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img