జల జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, జల జీవన్ మిషన్ వల్ల మహిళలు సాధికారులవుతున్నారని చెప్పారు. గతంలో తాగునీటిని తేవడం కోసం మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. జల జీవన్ మిషన్ వల్ల ఇక సమయం ఆదా అవుతుందన్నారు. మోదీ వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్లతో, గ్రామీణ నీరు, పారిశుద్ధ్యం కమిటీల ప్రతినిధులతో కూడా మాట్లాడారు.