Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జార్ఖండ్‌ జడ్జిది హత్యే

హైకోర్టుకు తెలిపిన సీబీఐ
రాంచీ: జాగింగ్‌కి వెళ్లిన జార్ఖండ్‌ జడ్జిని కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) జార్ఖండ్‌ హైకోర్టుకు తెలిపింది. అప్పట్లో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైర్‌గా మారింది. జులై 29న ధన్‌బాద్‌ జిల్లా అడిషనల్‌, సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ ఉదయం జాగింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే వెనక నుంచి వచ్చిన ఓ ఆటో ఆయన్ని బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆయనను ఒకరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆనంద్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన సీబీఐ..జడ్జి ఆనంద్‌ది హత్యేనని, కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపారని హైకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి గుజరాత్‌లోని గాంధీనగర్‌, దిల్లీ, ముంబై ప్రాంతాల్లో విచారణ చేసి తగిన ఆధారాలు సేకరించినట్లు వెల్లడిరచింది. ప్రస్తుతం విచారణ తుది దశలో ఉందని, ఫోరెన్సిక్‌ నివేదికలు తీసుకుంటే కేసు విచారణ పూర్తవుతుందని సీబీఐ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img