గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి మరో కేసులోనూ బెయిల్ లభించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అసోం కోక్రారaార్ పోలీసులు జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోక్రారaార్ కోర్టు మేవానీకి బెయిల్ ఇచ్చింది. అయితే ఆయనను పోలీసులు ఓ మహిళా కానిస్టేబులపై దాడి చేశాడన్న ఆరోపణలతో మరో కేసులో అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దాడి చేశాడని అభియోగాలు మోపారు. ఇప్పుడు ఈ కేసులో జిగ్నేష్ మేవానీ బెయిల్ పొందారు.