Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల్లేవ్‌

న్యూదిల్లీ: వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)లో ప్రస్తుతమున్న శ్లాబ్‌ రేట్లను పెంచుతారనే వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఐదు శాతంగా ఉన్న జీఎస్‌టీ శ్లాబ్‌ రేటును ఎనిమిది శాతానికి పెంచుతారన్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్‌టీ ప్రస్తుతం 5,12, 18, 28 శ్లాబ్‌ రేట్లు ఉన్నాయి. ఐదు శాతం శ్లాబులో ఉన్న కొన్ని ఆహారేతర వస్తువులను మూడు శాతం శ్లాబులోకి మార్చి, మిగిలిన వస్తువులను కొత్తగా ఏర్పాటు చేసే ఎనిమిది శాతం శ్లాబులోకి తెస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని గతంలోనే ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వం వహించగా, పశ్చిమబెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా, కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్‌, బీహార్‌ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్‌ప్రసాద్‌ సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఇప్పటివరకు నివేదికే సమర్పించలేదని అధికార వర్గాలు వెల్లడిరచాయి. ప్రస్తుతం జీఎస్‌టీ మండలి చైర్మన్‌గా ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా పర్యటనలో ఉన్నందున తదుపరి జీఎస్‌టీ మండలి సమావేశం ఎప్పుడనేది కూడా ఇంకా నిర్ణయించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img