Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టెన్త్‌ పరీక్ష రాసిన హర్యానా మాజీ సీఎం

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా (86) పదో తరగతి కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాశారు.
నిన్న పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్షకు హాజరయ్యారు. జేబీటీ రిక్రూట్‌మెంట్‌ కేసులో 2013లో ఆయనకు సీబీఐ కేసు 10ఏళ్ల జైలు శిక్ష విధించగా..జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే అప్పుడు ఇంగ్లీష్‌ పరీక్ష రాయలేకపోయారు. ఆ తర్వాత ఓపెన్‌లో భివాని ఎడ్యుకేషన్‌ బోర్డు 12వ తరగతి పరీక్షలు రాయగా..ఆ పరీక్షల ఫలితాలు ఆగస్టు 5న వచ్చాయి గానీ ఆయన ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. ఇంగ్లిష్‌ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఓం ప్రకాశ్‌ చౌతాలా సిర్సాలోని ఆర్య కన్య సీనియర్‌ సెకండరీ స్కూల్‌ పరీక్ష కేంద్రంలో కంపార్ట్‌ మెంట్‌ పరీక్ష రాశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img