Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

టేకాఫ్‌ సమయంలో రన్‌ వేపై జారిపోయిన ఇండిగో విమానం

ప్రమాదం సమయంలో విమానంలో 98 మంది పాసింజర్లు
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. అసోంలోని జొర్హాట్‌ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో రన్‌ వే నుంచి జారిపోయింది. రన్‌ వే పక్కనున్న బురదలో విమానానికి చెందిన ఒక చక్రం ఇరుక్కుపోయింది. చక్రం బురదలో ఇరుక్కుపోయిన ఫొటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు. దీంతో, ఈ విమాన సర్వీసును ఇండిగో ఆపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది పాసింజర్లు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img