పక్షపాతం చూపిస్తోంది
ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి
రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
న్యూదిల్లీ : సోషల్మీడియా సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ సంస్థ పక్షపాతంగా వ్యవహరి స్తోందని, తన ఖాతాను నిలిపివేసి దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మనకు రాజకీయాలు నేర్పాలని చూస్తోందని ఆరోపించారు. దిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను పంచుకు న్నందుకు రాహుల్గాంధీ ఖాతాను ట్విటర్ ఇటీవల తాత్కాలికంగా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారిక ఖాతాతో పాటు ఆ పార్టీకి చెందిన అనేకమంది నాయకులు, కార్యకర్తలకు చెందిన దాదాపు 5వేల ఖాతాలను ట్విట్టర్ నిలిపి వేసింది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన రాహుల్.. శుక్రవారం తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘ట్విట్టర్ ఓ తటస్థ సామాజిక మాధ్యమ వేదిక కాదని స్పష్టమవు తోంది. ఇది ఓ పక్షపాత వేదిక. ప్రభుత్వం ఏం చెబితే అది వింటోంది. నా ట్విట్టర్ ఖాతాను నిలిపివేసి మన రాజకీయ విధానాల్లో జోక్యం చేసుకుంటోంది. మనకు రాజకీయాలను నేర్పేందుకు చూస్తోంది. ఒక రాజకీయ నాయకుడిగా దీన్ని నేను అంగీకరించలేను. ఇది కేవలం రాహుల్గాంధీ మీద జరిగిన దాడి కాదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరుగుతున్న దాడి. నా ఖాతాను నిలిపివేయడం అంటే కేవలం రాహుల్ గాంధీని అడ్డుకోవడం కాదు. నాకు 19-20 మిలి యన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారి హక్కులను కూడా అడ్డుకున్నట్లే’ అని రాహుల్ దుయ్యబట్టారు. ‘ఒక భారతీయుడిగా నేను అడిగే ప్రశ్న ఒక్కటే.. ప్రభుత్వానికి విధేయంగా ఉంటున్నాయని కంపెనీలు మనకు రాజకీయాలు నేర్పడాన్ని అంగీకరిద్దామా? లేదా మన రాజకీయాలను మనమే నిర్వచించుకుం దామా? మన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది. పార్లమెంట్లో మాట్లాడనివ్వట్లేదు. మీడియాను నియంత్రిస్తున్నారు. ఇప్పుడు మా అభిప్రాయాలను ట్విటర్లో పెడుతుంటే అక్కడా అణగదొక్కాలని చూస్తున్నారు’ అని మోదీ సర్కారుపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు.