Friday, April 19, 2024
Friday, April 19, 2024

తమిళనాడులోని 45 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

కొయంబత్తూర్‌ కారు బ్లాస్ట్‌ కేసులో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే గురువారం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్‌ నగరాల్లోని 45 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. అనుమానితులు, వారికి సంహకరించిన వారి ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పుడుపెట్‌, మన్నాడి, జమాలియా, పెరంబూరుతోపాటు కోయంబత్తూరు, కొట్టయ్‌మేడు, ఉక్కడం, పొన్విరaా నగర్‌, రతినపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.దీపావళికి ఒకరోజు ముందు అంటే అక్టోబర్‌ 23న ఉదయం 4.30 గంటల సమయంలో తమిళనాడు కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతి కారులో ఉన్న సిలిండర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్‌ బాల్స్‌, గాజుపెంకులు, అల్యూమినియం మేకులు కనిపించండంతో అనుమానాలకు తావిచ్చింది. ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో అదేనెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img