చెన్నై : తమిళనాడు నూతన గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మునుపటి గవర్నర్గా ఉన్న బన్వరీలాల్ పురోహిత్ పంజాబ్ గవర్నర్గా వెళ్లారు. ఇక్కడ రాజ్ భవన్ వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నూతన గవర్నర్ ఆర్ఎన్ రవి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రతిపక్ష నాయకుడు కె.పళనిస్వామి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గతవారం ఐపీఎస్ మాజీ అధికారి అయిన రవిని రాష్ట్ర గవర్నర్గా నియమించారు. నాగాలాండ్ నుండి బదిలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నాగా శాంతి చర్చల కోసం సంభాషణకర్తగా రవిని నియమించింది. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం స్టాలిన్ తన మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎం.అపువును నూతన గవర్నర్ రవికి పరిచయం చేశారు.