అగర్తల: త్రిపురలో పాగా వేయాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్…అక్కడ 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ‘త్రిపురార్ జొన్నో తృణమూల్’ పేరుతో ప్రచారం ప్రారంభించింది. త్రిపురలో తృణమూల్ వ్యవహారాలు చూసుకుంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు శుక్రవారం ప్రచార కార్యక్రమంలో ఉండగా బీజేపీ కార్యకర్తలు ఆమె కారుపై దాడికి పాల్పడ్డారు. ప్రచారంలో పాల్గొన్న మిగతా వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన సుస్మిత పశ్చిమ త్రిపుర జిల్లా అమ్తులి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుస్మితతోపాటు త్రిపురలో టీఎంసీ కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్ సభ్యులపైనా బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, వారి ఫోన్లు ఎత్తుకెళ్లారని టీఎంసీ ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ ఉనికిని త్రిపుర సీఎం బిప్లవ్ దేబ్ భరించలేకపోతున్నారని మరోమారు రుజువైందని మండిపడిరది.