దిల్లీ : వృత్తిరీత్యా డాక్టర్ అయిన కేంద్ర మంత్రి భగవత్ కరాద్.. తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు.. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రిపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. మంగళవారం రాత్రి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాద్, దిల్లీ నుంచి ముంబైకి బయల్దేరారు.. ఇండిగో విమానంలో ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో.. తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పితో బాధపడ్డ ఆయన.. బీపీ లెవల్స్ కూడా పడిపోయాయి. ఇది గమనించిన కరాద్.. వెంటనే వైద్యం అందించారు. గ్లూకోజ్ అందించడంతో సదరు ప్రయాణికుడు త్వరగా కోలుకున్నాడు. ఈ ఘటనను సోషల్ మీడియా షేర్ చేసిన ఇండిగో యాజమాన్యం.. సదరు మంత్రికి ధన్యవాదాలు తెలిపింది.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఎప్పుడూ ఆయన ఒక హృదయం ఉన్న డాక్టర్.. గొప్ప మనసున్న నా కొలీగ్ అంటూ ప్రశంసలు కురిపించారు.