Friday, April 19, 2024
Friday, April 19, 2024

త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌పై హత్యాయత్నం

ముగ్గురి అరెస్టు
త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌దేవ్‌పై హత్యాయత్నం జరిగింది. గురువారం సాయంత్రం అగర్తాలాలోని శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ లేన్‌లోని తన అధికారిక నివాసం వద్ద విప్లవ్‌ కుమార్‌ సాయంత్రం వాకింగ్‌ చేస్తుండగా.. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కారులో వచ్చి ముఖ్యమంత్రిని ఢీకొట్టేందుకు యత్నించారు. అప్రమత్తంగా ఉన్న ఆయన వెంటనే పక్కకు తొలిగారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. దుండగులను పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది యత్నించారు. దర్యాప్తు జరిపి..మరుసటి రోజు రాత్రి.. కెర్చ్‌ నుమానీ అనే ప్రాంతానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేశామని వారు వెల్లడిరచారు. పోలీసులు ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురినీ కోర్టులో హాజరు పరచగా వీరికి 14 రోజుల జుడీషియల్‌ కస్టడీకి రిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img