: ఎంపీ నామా నాగేశ్వరరావు
దళితబంధును దేశవ్యాప్తంగా అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఓబీసీల కోసం ఎన్నో పథకాలు చేపట్టారన్నారు. రైతుల కోసం రైతు బంధు తీసుకువచ్చామని, ప్రతి ఏడాది ఒక ఎకరాకు పది వేలు ఇస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సభలో.. ఓబీసీలు, దళితు ల కోసం మాట్లాడుతున్నారని, ఆ స్కీమ్ ప్రకారం దళిత ఫ్యామిలీలకు పది లక్షలు ఇస్తున్నామని తెలిపారు.