బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను మెరుగైన చికిత్స నిమిత్తం దిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ఆదివారం తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో ఆయన కుడి భుజం ఎముక విరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేర్చించారు. అయితే..లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్కు తీసుకెళ్లినట్టు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. అయితే..ఇక్కడి వైద్యులు గతంలో ఆయనకు చికిత్స చేశారన్నారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలిస్తామన్నారు. లాలూ పెద్దకుమర్తె మిసా భారతి లాలూతోనే ఉన్నారు. లాలూ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ విమానంలో ఢల్లీి చేరుకున్నారు. లాలూ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. బుధవారం పాట్నాలోని పరాస్ ఆసుపత్రికి వెళ్లి లాలూను పరామర్శించారు.