న్యూదిల్లీ : ఈ ఏడాది ఇప్పటివరకు దేశ రాజధానిలో 340 కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క సెప్టెంబర్లోనే 217 కేసులున్నాయి. గత మూడేళ్లలో ఒక నెలలో అత్యధిక కేసులు నమోదవటం ఇదే. ఈ సీజన్లో అక్టోబర్ 2 వరకు మొత్తం 341 డెంగీ కేసులు నమోదు కాగా 2020 లో ఇదే కాలంలో 266 కేసులు నమోదయ్యాయి. 2020 లో మొత్తం 1,072 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. దక్షిణ దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబరులో 188, 2019లో 190 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నగరంలో డెంగ్యూ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.