Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దివ్యాంగ చిన్నారిని ఎక్కనివ్వని ఇండిగోపై రూ.5 లక్షల జరిమానా

దివ్యాంగ చిన్నారిని విమానం ఎక్కడానికి నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ రూ.5 లక్షల జరిమానా విధించింది. మే ఏడో తేదీన రాంచీ నుంచి హైదరాబాద్‌ రావాల్సిన దివ్యాంగుడైన బాలుడి ఫ్లైట్‌ ఎక్కడానికి సిబ్బంది ఒప్పుకోలేదు. దాంతో వారి తల్లిదండ్రులు కూడా తమ ప్రయాణాన్ని ఆపుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై స్వయంగా కేంద్ర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే స్వయంగా దర్యాప్తు చేపడతానని చెప్పారు. అలాగే ఈ ఘటనపై నిజనిజాలు తెలుసుకోవడానికి డీజీసీఏ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విచారణలో తెలిసిన వివరాలను బట్టి డీజీసీఏ ఇండిగోకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. జరిగిన ఉదంతంపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఇండిగోకు అవకాశం ఇచ్చింది. ‘‘దివ్యాంగ చిన్నారి పట్ల ఇండిగో సిబ్బంది ప్రవర్తన లోపభూయిష్టంగా ఉంది. పరిస్థితిని మరింత తీవ్రతరం చేశారు.’’ అని దర్యాప్తులో తేలినట్టు డీజీసీఏ పేర్కొంది. సిబ్బంది సున్నితంగా డీల్‌ చేసి ఉండొచ్చని, బోర్డింగ్‌ను నిరాకరిస్తు పరిస్థితిని జఠిలం చేశారని వెల్లడిరచింది.
సందర్భానికి అనుగుణంగా ప్రవర్తించడంలో విమాన సిబ్బంది విఫలం అయ్యారని తెలిపింది. వీటిని పరిగణలోకి తీసుకుని నిబంధనల ప్రకారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై రూ.5 లక్షలు జరిమానా విధించాలని డీజీసీఏ లోని కాంపిటెంట్‌ అథారిటీ నిర్ణయించిందని డీజీసీఏ తెలియజేసింది. అలాగే ఇలాంటి సందర్భాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని, తగిన మార్పులను చేస్తామని ప్రకటించింది. ఇదే సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో మరింత మానవత్వంతో వ్యవహరించేందుకు వీలుగా విమానయాన సంస్థలు తమ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్లు శిక్షణా ప్రక్రియలను పున:పరిశీలించాలని డీజీసీఏ సూచించింది.మే మొదటి వారంలో రాంచీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఓ కుటుంబం ఇండిగో సంస్థ విమానంలో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే ఆ కుటుంబంలో దివ్యాంగుడైనా చిన్నారిని విమానంలో ఎక్కించుకునేందుకు విమాన సిబ్బంది నిరాకరించింది. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని, దానివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందంటూ విమానం ఎక్కనివ్వలేదు. ఈ సంఘటన రాంచీలో చోటుచేసుకుంది. దాంతో బాలుడి తల్లిదండ్రులు కూడా తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు.
అయితే ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిరచారు. ఈ విషయం వైరల్‌ అయింది. దాంతో ఇండిగో సిబ్బంది వ్యవహార శైలీపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇలాంటి ప్రవర్తన సరైనది కాదని, ఏ వ్యక్తికి ఇలాంటి అనుభవం జరగకూడదని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్చ జరగడంతో ఇండిగో సీఈవో రొనొజాయ్‌ దత్తా స్పందించారు. ప్రయాణికుల సేవ తమకు ముఖ్యమని ఆయన అన్నారు. దివ్యాంగులైన చిన్నారుల కోసం బతికే తల్లిదండ్రులు నిజమైన హీరోలని అన్నారు. చిన్నారికి ఎలక్ట్రిక్‌ వీల్‌ చైర్‌ను అందజేస్తానని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img