‘దేఖో మేరే ఢల్లీి’ మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ మొబైల్ యాప్ను ఇవాళ ప్రారంభించారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ యాప్ను ఉపయోగించుకుని తమ పర్యటనలను ప్లాన్ చేసుకోవచ్చని చెప్పారు. ఢల్లీిలో పర్యటించాలనుకునే ప్రాంతాలకు టిక్కెట్లు కూడా వారు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్లో ఈటింగ్ జాయింట్స్, ఫన్ ప్లేసెస్, చారిత్రక స్థలాలు, ఎంటర్టైన్మెంట్ వెన్యూలకు సబంధించిన సమాచారం ఉంటుందని తెలిపారు. ఈ యాప్తో పర్యాటకరంగం మరింత పుంజుకుంటుదనే నమ్మకం తమకు ఉందన్నారు. ఢల్లీి ప్రజలతో సహా ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కేజ్రీవాల్ కోరారు.ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, టూరిస్టుల సంపూర్ణ యాత్రకు ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ఢల్లీి విచ్చేసే ప్రపంచ పర్యాటకులకు చక్కటి అనుభూతి కలిగించడమే తమ లక్ష్యమని చెప్పారు.