దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 5,26,826 మంది మృతిచెందారు. మరో 1,28,261 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 19,539 మంది బాధితులో వైరస్నుంచి బయటపడగా, 54 మంది మృతిచెందారు.రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.29 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.52 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 207.03 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.