Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు

గత కొద్దిరోజులుగా 20 వేలకు సమీపంలోనే కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,40,00,138కి చేరాయి. ఇందులో 4,33,30,442 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,312 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,43,384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 54 మంది మరణించగా, 20,958 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రోజువారీ పాజిటివిటీ రేట 5.05 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక ఇప్పటివరకు 203.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img