Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 2,568 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. 20 మంది మరణించినట్లు పేర్కొన్నది. కరోనా మహమ్మారి నుంచి మరో 2,911 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 19,137 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 189.41 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img